నగర మౌలిక వసతులకు రూ.140 కోట్ల నిధులు
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద నగర రహదారుల అభివృద్ధికి నిధులు... సీసీ రోడ్లు, పార్కులు, డ్రైనేజీలు సహా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళిక... త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే దిశగా వీఎంసీ కసరత్తు...

విజయవాడ, సెప్టెంబరు 8: విజయవాడ నగరంలో రహదారులు, డ్రైనేజీలు సహా మౌలిక వసతుల అభివృద్ధికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద రూ.140 కోట్ల నిధులు మంజూరైనట్లు సమాచారం. ఈ నిధులతో నగరంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు పార్కులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు.
ప్రస్తుతం పనులకు సంబంధించిన డీపీఆర్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులను ప్రారంభించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నగరంలోని అంతర్గత రహదారులు పలుచోట్ల దెబ్బతిని వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిధులతో చేపట్టే పనులపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రానున్న ఎన్నికలకు ముందే పనులను మంజూరు చేయడంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
