రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
యాదాద్రి భువనగిరి జిల్లాలో ల్యాబ్పై పోలీసుల దాడులు 27 కిలోల మెఫెడ్రిన్, 40 కిలోల అసిటోన్ లిక్విడ్ స్వాధీనం నలుగురు నిందితులు అదుపులో.. మరొకరి కోసం గాలింపు

యాదాద్రి భువనగిరి: కొండమడుగు ప్రాంతంలోని ఓ ల్యాబ్పై పోలీసులు దాడులు నిర్వహించి సుమారు రూ.54 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 27 కిలోల మెఫెడ్రిన్తో పాటు 40 కిలోల అసిటోన్ లిక్విడ్ను గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, డ్రగ్స్ను ఎక్కడ తయారు చేశారు, ఎక్కడికి తరలించేందుకు సిద్ధం చేశారు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

