ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ19, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

‘ఉత్తమ అధికారి’కి ఏసీబీ షాక్.. రూ.15 వేల లంచంతో చిక్కిన ఆర్‌ఐ!

కొత్త ఇంటికి పన్ను విధించేందుకు రూ.15 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ... లంచం తీసుకుంటుండగా ఒంగోలు కార్పొరేషన్ ఆర్‌ఐ నరేంద్రను పట్టుకున్న ఏసీబీ... ఇటీవలే ‘ఉత్తమ అధికారి’గా ప్రశంసా పత్రం.. ఇప్పుడు ఏసీబీకి చిక్కడంతో చర్చ...

V10TV న్యూస్ డెస్క్ 19 ఆగస్టు, 2026 11:12 AMకి 1,453 వీక్షణలు
‘ఉత్తమ అధికారి’కి ఏసీబీ షాక్.. రూ.15 వేల లంచంతో చిక్కిన ఆర్‌ఐ! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కారు. కొత్తగా నిర్మించిన ఇంటికి పన్ను విధించేందుకు రూ.15 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేషన్ ఆర్‌ఐ నరేంద్రను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

బాధితుడి నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటున్న సమయంలో ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నరేంద్రను పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం సంబంధిత కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించినట్లు తెలిసింది.

ఈ ఘటనలో మరో ఆసక్తికర అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నరేంద్ర ‘ఉత్తమ అధికారి’గా ప్రశంసా పత్రం అందుకున్నారు. మంత్రి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న కొద్ది రోజులకే లంచం ఆరోపణలపై ఏసీబీకి చిక్కడం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ప్రశంసా పత్రంతో ‘ఉత్తమ అధికారి’గా గుర్తింపు పొందిన నరేంద్ర ఇప్పుడు రూ.15 వేల లంచం కేసులో ఏసీబీ వలకు చిక్కడంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఘటనపై ఏసీబీ అధికారులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో యువతికి రూ.8.06 లక్షల టోకరా

30 నిమిషాల క్రితం 0

రాజమండ్రి నేతలతో భేటీ కానున్న వైఎస్ జగన్

46 నిమిషాల క్రితం 1

డేటా సెంటర్లపై దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి లోకేష్

55 నిమిషాల క్రితం 1

పాతికేళ్ల భూ సమస్యకు తెర.. లోకేష్ చొరవతో శాశ్వత పరిష్కారం

2 గంటల క్రితం 2,146