ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ22, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

యూరప్‌లో ఉద్యోగాల పేరుతో రూ.కోట్ల మోసం!

‘ఫ్లయింగ్ బోర్డర్స్’ పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టినట్లు సౌజన్యపై ఆరోపణలు... విశాఖ, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల యువత నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులు... కృష్ణా జిల్లా తాడిగడపలో సౌజన్యను అరెస్టు చేసి విశాఖకు తరలించిన ద్వారకా పోలీసులు...

V10TV న్యూస్ డెస్క్ 22 ఆగస్టు, 2026 4:58 PMకి 2,146 వీక్షణలు
యూరప్‌లో ఉద్యోగాల పేరుతో రూ.కోట్ల మోసం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విశాఖ, ఆగస్టు 22: యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువత నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఫ్లయింగ్ బోర్డర్స్’ సంస్థకు చెందిన సౌజన్యను విశాఖ ద్వారకా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

విశాఖతో పాటు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పలువురు నిరుద్యోగ యువతకు యూరప్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో డబ్బులు చెల్లించినప్పటికీ ఎంతకాలమైనా ఉద్యోగాలు రాకపోవడంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు విశాఖ ద్వారకా పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ద్వారకా పోలీసులు సౌజన్య ఆచూకీపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆమె కృష్ణా జిల్లా తాడిగడపలో ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన విశాఖ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అనంతరం సౌజన్యను అరెస్టు చేసి విశాఖకు తరలించినట్లు తెలుస్తోంది. బాధితుల నుంచి మొత్తం ఎంత నగదు వసూలు చేశారు? ఎంతమంది ఈ సంస్థకు డబ్బులు చెల్లించారు? ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పోలీసుల అధికారిక దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

వరుస చోరీలకు చెక్.. అంతరాష్ట్ర దొంగ అరెస్ట్

37 నిమిషాల క్రితం 1,369

ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు జర్నలిస్టుల అభినందన వెల్లువ

55 నిమిషాల క్రితం 1,258

పారిశ్రామిక హబ్‌గా అనకాపల్లి.. దేశానికే ఆదర్శం!

1 గంట క్రితం 1,236

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ పవన్‌కిషోర్

2 గంటల క్రితం 3,260