ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ7, సెప్టెంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

ఆముదార్లంకలో దాదాపు రూ.కోటితో అభివృద్ధి పనులు... రూ.85.70 లక్షలతో నిర్మించిన ఏడు సీసీ రోడ్లు ప్రారంభం... గ్రామాలకు మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్...

V10TV న్యూస్ డెస్క్ 7 సెప్టెంబర్, 2026 2:55 PMకి 1,747 వీక్షణలు
గ్రామాల అభివృద్ధే ధ్యేయం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

చల్లపల్లి, సెప్టెంబరు 7 : గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సోమవారం చల్లపల్లి మండలం ఆముదార్లంకలో దాదాపు రూ.కోటి నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

‘పల్లె పండుగ-1’లో భాగంగా రూ.85.70 లక్షలతో 1.45 కిలోమీటర్ల మేర నిర్మించిన ఏడు సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.9 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన మంచినీటి పైప్‌లైన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కృష్ణానదికి వరదలు వచ్చిన ప్రతిసారీ నదీగర్భ గ్రామాల్లో సహాయక చర్యలకు రహదారుల సమస్య ఎదురవుతోందన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ‘పల్లె పండుగ-1’లో ఉపాధి హామీ నిధులతో నదీగర్భ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.

అవనిగడ్డ నియోజకవర్గంలో ‘పల్లె పండుగ-1’ కింద రూ.31.65 కోట్లతో 45.6 కిలోమీటర్ల మేర 462 సీసీ రోడ్లు నిర్మించినట్లు వెల్లడించారు. ‘పల్లె పండుగ-2’ నిధులతో దాదాపు 15 కిలోమీటర్ల మేర తారు రోడ్లు నిర్మించామని, రాబోయే ‘పల్లె పండుగ-3’లో రైతులకు కీలకమైన డొంక రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఆముదార్లంక భౌగోళికంగా బాపట్ల జిల్లాలో ఉన్నప్పటికీ నియోజకవర్గ పరిధిలోని గ్రామంగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఐక్యత ఉంటే అభివృద్ధి మరింత వేగంగా సాధ్యమవుతుందన్నారు. రహదారుల నిర్మాణానికి సహకరించిన గ్రామ పెద్ద వేములపల్లి రాఘవేంద్రరావును అభినందించారు.

అనంతరం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ను గ్రామ పెద్దలు, టీడీపీ, జనసేన నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో మండలి వెంకట్రామ్, తోట కనకదుర్గ, మోర్ల రాంబాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఆనందకుమారి, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కొత్త పింఛన్ల నమోదు తప్పుల తడక

10 నిమిషాల క్రితం 0

అక్షర విద్యాలయానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

23 నిమిషాల క్రితం 1,598

విజయవాడ మేయర్ అభ్యర్థిగా ముస్లిం మైనార్టీకి అవకాశం కల్పించాలి

1 గంట క్రితం 2,547

టూ టౌన్ పోలీస్ స్టేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలి

1 గంట క్రితం 1,541