శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
టీటీడీ ఆహ్వాన పత్రిక అందజేసిన ఛైర్మన్, పాలకమండలి సభ్యులు... చంద్రబాబుకు వేద పండితుల ఆశీర్వచనం... బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో సీఎం చర్చ...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
అమరావతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానించింది. టీటీడీ పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు, సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, జానకీదేవి, కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ

సందర్భంగా టీటీడీ వేద పండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చేపడుతున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పించనున్న సౌకర్యాలపై టీటీడీ ఛైర్మన్, కార్యనిర్వహణాధికారితో ముఖ్యమంత్రి చర్చించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

