ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ24, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఆపదలో అండగా CMRF.. అర్హులందరికీ భరోసా

ప్రజా వేదికలో సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కులం, మతం, పార్టీ తేడా లేకుండా ప్రతి అర్హుడికీ సహాయం అందేలా కృషి గుడివాడ నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో సీఎంఆర్‌ఎఫ్ నిధులు తీసుకొచ్చామని వెల్లడి

V10TV న్యూస్ డెస్క్ 24 ఆగస్టు, 2026 6:10 PMకి 1 వీక్షణలు
ఆపదలో అండగా CMRF.. అర్హులందరికీ భరోసా — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గుడివాడ, ఆగస్టు 24: అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్‌ఎఫ్ సాయం అందేలా తన వంతు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని ప్రజా వేదిక కార్యాలయంలో సోమవారం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, ప్రాంతాల నుంచి సీఎంఆర్‌ఎఫ్ సహాయం కోసం వచ్చిన బాధితులు ఎమ్మెల్యే రామును కలిశారు. వారి దరఖాస్తులను ఆయన స్వయంగా పరిశీలించారు. అవసరమైన పత్రాలు పూర్తిగా లేని దరఖాస్తుదారులకు వాటిని సమర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము వారి ఆరోగ్య పరిస్థితి, జరుగుతున్న చికిత్స, వైద్య ఖర్చుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలు పాటించాలని చెప్పారు. అనారోగ్యం కారణంగా పేద కుటుంబాలు అప్పులపాలు కాకుండా ప్రభుత్వ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇప్పటికే గుడివాడ నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో సీఎంఆర్‌ఎఫ్ నిధులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, అర్హతకు సంబంధించిన పత్రాలను పరిశీలించి ప్రభుత్వ సహాయం త్వరగా అందేలా కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేద కుటుంబాలకు వైద్యపరంగా అండగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి సహాయనిధి ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికీ చేరేలా నిరంతరం పనిచేస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జి, తేనెల ఏడుకొండలు, మళ్లీ పెద్ది సుబ్రహ్మణ్యం, అరిపిరాల రవి, భద్రయ్య, నంబూరి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

విజయవాడ నుంచి ఢిల్లీకి ఉపరాష్ట్రపతి

1 గంట క్రితం 1,323

విదేశీ టూర్‌పై పొలిటికల్ ఫైట్!

2 గంటల క్రితం 2,124

కృష్ణా జలాలపై ఏపీ–తెలంగాణ పట్టు!

2 గంటల క్రితం 2,659

రామగుండంలో ఎన్ఐఏ సోదాలు.. యువకుడి ఇంట్లో తనిఖీలు

2 గంటల క్రితం 2,366