ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 16 (వి10 టీవీ) ఎయిర్పోర్ట్.. విశాఖ కి బై.. భోగాపురానికి వెల్కమ్..
రాష్ట్రంలో 5 దశాబ్దాలుగా సేవలందించిన విశాఖ ఎయిర్పోర్టు సేవలకు త్వరలో ముగింపు... 1941లో బ్రిటీష్ హయాంలో ప్రారంభమైన విమానాశ్రయం.. 1972లో నేవీ ఆధ్వర్యంలోకి... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటంతో విశాఖ ఎయిర్పోర్టు సేవలు నిలిచిపోనున్నాయి...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విశాఖపట్నం: రాష్ట్రంలో సుమారు ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్న విశాఖపట్నం విమానాశ్రయం సేవలకు త్వరలో ముగింపు పలకనుంది. 1941లో బ్రిటీష్ పాలనలో ప్రారంభమైన ఈ విమానాశ్రయం 1972లో నేవీ ఆధ్వర్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పౌర విమానయాన సేవలకు వినియోగంలోకి వచ్చింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటంతో విశాఖ విమానాశ్రయంలోని రెగ్యులర్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. దీంతో దశాబ్దాలుగా విశాఖ నగరానికి విమాన సేవలు అందించిన విమానాశ్రయం చరిత్రలో భాగం కానుంది. భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత రాష్ట్ర విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.

తోలి రోజే 31 విమానాలు రానున్నాయని సమాచారం.

