ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ8, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

దేశంలో అవినీతి రాజ్యమేలుతోంది: సీపీఐ నారాయణ

రూ.28 లక్షల కోట్ల అవినీతి జరిగిందని నారాయణ ఆరోపణ గతం కంటే చంద్రబాబు పాలన దారుణంగా మారిందంటూ విమర్శ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో సమూల మార్పులే లక్ష్యంగా సీపీఐ పాదయాత్ర

V10TV న్యూస్ డెస్క్ 8 ఆగస్టు, 2026 6:04 PMకి 1 వీక్షణలు
దేశంలో అవినీతి రాజ్యమేలుతోంది: సీపీఐ నారాయణ — చిత్రం 1
దేశంలో అవినీతి రాజ్యమేలుతోంది: సీపీఐ నారాయణ — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ చేపట్టిన దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా విజయవాడలో మూడో రోజు ప్రజా ప్రచార పాదయాత్ర నిర్వహించారు. కొత్తపేట సాయిరాం థియేటర్ నుంచి నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు సాగిన పాదయాత్రను సీపీఐ సీనియర్ నేత కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. దేశంలో సుమారు రూ.28 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు, మతోన్మాదం పెరుగుతున్నాయని విమర్శించారు. దేవుడిని నమ్ముకోవడం కంటే రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడి పేరును ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా

దేశంలో అవినీతి రాజ్యమేలుతోంది: సీపీఐ నారాయణ — అదనపు చిత్రం 2

నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. గతంతో పోలిస్తే చంద్రబాబు పాలన మరింత దారుణంగా మారిందని ఆరోపిస్తూ, అభివృద్ధి పేరుతో ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టడంపైనే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అన్ని విభాగాల్లో మార్పు రావాలనే లక్ష్యంతోనే పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సమగ్రాభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ, మహిళా సమాఖ్య, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కేసీఆర్ చేసినన్ని యాగాలు ఎవరూ చేయలేరు: కేటీఆర్

2 గంటల క్రితం 1

అదే జరిగితే తెలంగాణలో జనసేన ఒంటరి పోటీ: శంకర్ గౌడ్

2 గంటల క్రితం 1

గుడివాడ గడపల్లో ‘ఇంటింటికి టీడీపీ’

2 గంటల క్రితం 189

పాల ధర పెంపుపై భగ్గుమన్న సీపీఎం

4 గంటల క్రితం 147